Danish Kaneria : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడి(Lord Sri Rama) ప్రాణ ప్రతిష్ట వేడుక ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. హిందువుల అరాధ్య దైవమైన రాముడి భవ్య దివ్య మందిరం ప్రారంభోత్సవానికి ఇప్పటికే దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ సమయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
హిందువు అయిన కనేరియా కాషాయ జెండా పట్టుకొని ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. ‘మా ప్రభువు శ్రీరాముడి అద్భుతమైన ఆలయం సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి ఇంకా 8 రోజులే మిగిలింది. అందరూ జై శ్రీరామ్ అనండి’ అంటూ ఈ మాజీ స్పిన్నర్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన మందిరంలో జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది.
हमारे राजा श्रीराम का भव्य मंदिर है तैयार,
अब सिर्फ 8 दिन का है इंतजार!बोलो जय जय श्री राम। pic.twitter.com/poojMBb7U4
— Danish Kaneria (@DanishKaneria61) January 14, 2024
కనేరియాది గుజరాతీ మూలాలున్న కుటుంబం. దేశ విభజన కంటే ముందే వాళ్ల ఫ్యామిలీ సూరత్ నుంచి కరాచీకి వలస వెళ్లింది. చిన్నప్పటి నుంచి క్రికెట్పై ఇష్టం పెంచుకున్న కనేరియా లెగ్ స్పిన్నర్గా మారాడు. 2000 సంవత్సరంలో అరంగేట్రం చేసిన అతడు పాకిస్థాన్ జట్టుకు ఆడిన తొలి హిందువుగా రికార్డు సృష్టించాడు.
బంగ్లాదేశ్పై తొలి టెస్ట్ ఆడిన కనేరియా.. అదే జట్టుపై 77/7తో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. అయితే.. పదేండ్ల కెరీర్లో కనేరియా 61 టెస్టులు, 18 వన్డేలు మాత్రమే ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 261, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు.