హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్తో వన్డే సిరీస్ జరుగుతుండగా.. మధ్యలోనే సౌతాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్కు వెళ్లడాన్ని అఫ్రీది తప్పుపట్టాడు. తాజాగా ముగిసిన వన్డే సిరీస్ను పాకిస్థాన్ 2-1 తేడాతో నెగ్గింది. అయితే ఈ సిరీస్ సాగుతుండగానే.. సౌతాఫ్రికా కీలక ప్లేయర్లు క్వింటెన్ డికాక్, కగిసో రబడాలు ఇండియాకు బయలుదేరి వెళ్లారు. ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు ప్లేయర్లు ఐపీఎల్కు వెళ్లడాన్ని అఫ్రిది ప్రశ్నించాడు. క్రికెట్ సౌతాఫ్రికా తీరు సరిగా లేదంటూ విమర్శించాడు. అంతర్జాతీయ క్రికెట్పై టీ20 లీగ్ ప్రభావం చూపుతున్నట్లు ఆరోపించాడు. ఇలాంటి ఘటనలపై పునరాలోచించాలని అఫ్రీది తన ట్వీట్లో తెలిపాడు.