Pakistan Cricket Coaches: గడిచిన ఏడెనిమిదేండ్లుగా ఫారెన్ కోచ్ల వెంట పడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకు వారి సేవలకు సెలవు ప్రకటించింది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఓటమితో పాటు ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్న మికీ ఆర్థర్తో పాటు సహాయక కోచ్లుగా ఉన్న గ్రాంట్ బ్రబర్న్, ఆండ్రూ పుటిక్లను గుడ్ బై చెప్పనుంది. ప్రస్తుతం పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ ఈ ముగ్గురితో ఫైనల్ సెటిల్మెంట్ గురించి చర్చిస్తున్నారని ఇది ముగియగానే బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఇదే విషయమై పీసీబీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ… ‘మిక్కీ ఆర్థర్ ఇదివరకే డెర్బీషైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పుటిక్, బ్రబోర్న్లు కూడా కొత్త అసైన్మెంట్లు చేసుకున్నారు. పలు సంప్రదింపుల తర్వాత వాళ్లు పీసీబీ కాంట్రాక్టుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి వాళ్ల ఫైనల్ సెటిల్మెంట్కు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి..’ అని తెలిపాడు. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్.. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లలో దారుణ ప్రదర్శనలతో సారథిగా వైదొలిగాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో షాన్ మసూద్ సారథ్యంలో పాక్.. మూడు టెస్టులలో మూడింటికి ఓడింది.
Mickey Arthur is expected to reveal his decision after discussions with the PCB.#PCB #MickeyArthur
Read More: https://t.co/xR2IAViIqT pic.twitter.com/f25Zpqmtpw
— ProPakistani (@ProPakistaniPK) January 9, 2024