దుబాయ్: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో యువ భారత జట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అండర్-19 ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో శనివారం జరిగిన పోరులో భారత్ చివరి బంతికి ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. ఆరాధ్య యాదవ్ (50), హర్నూర్ సింగ్ (46) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ సరిగ్గా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.