చటోగ్రామ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 109/0తో మంగళవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ 58.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన ఆబిద్ అలీ (91) తృటిలో శతకం చేజార్చుకోగా.. అబ్దుల్లా షఫీఖ్ (73) రాణించాడు. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 330 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 286 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో బంగ్లా 157 పరుగులకే ఆలౌటవడంతో ఈ మ్యాచ్పై పాకిస్థాన్ పట్టు సాధించగలిగింది. ఆబిద్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.