షార్జా: పసికూన స్కాట్లాండ్తో మ్యాచ్లో పాకిస్థాన్ ఓపెనర్లు నిదానంగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్కు బాబర్ ఆజమ్ (17 నాటౌట్), మొహమ్మద్ రిజ్వాన్ (15) నిలకడైన ఆరంభం అందించారు.
దీంతో పాక్ జట్టు ఆరు ఓవర్లకు 35 పరుగులు చేసింది. ఆ వెంటనే ఏడో ఓవర్ తొలి బంతికే రిజ్వాన్ను హంజా తాహిర్ పెవిలియన్ చేర్చాడు.