PAK vs SA: వన్డే వరల్డ్ కప్లో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కూడా పాకిస్తాన్ తడబడుతోంది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్.. 28 ఓవర్లు ముగిసేటప్పటికీ ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 50, 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఆదుకున్నా.. దానిని మూడంకెల స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. . సఫారీ బౌలర్లు పాక్ బ్యాటర్లను కట్టడి చేస్తూ వారిని ఒత్తిడిలోకి నెడుతున్నారు.
చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో 4వ ఓవర్లోనే ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (9) వికెట్ను కోల్పోయింది. మార్కో జాన్సెన్ దక్షిణాఫ్రికాకు తొలి బ్రేక్ ఇచ్చాడు. అతడే వేసిన ఆరో ఓవర్లో మూడో బంతికి ఇమామ్ ఉల్ హక్ (12)ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన మహ్మద్ రిజ్వాన్ (27 బంతుల్లో 31, 4 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ఫర్వాలేదనిపించాడు. కానీ రిజ్వాన్ను కొయెట్జ్.. 15వ ఓవర్లో ఐదో బంతికి ఔట్ చేశాడు. ఇఫ్తికార్ అహ్మద్ (31 బంతుల్లో 21, 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. వరల్డ్ కప్లో బాబర్కు ఇది మూడో అర్థ సెంచరీ. కానీ బాబర్ను షంషి.. 27వ ఓవర్లో ఐదో బంతికి పెవిలియన్కు పంపాడు. దీంతో పాక్ ఐదో వికెట్ కోల్పోయింది.