Naseem Shah : ఆసియా కప్(Asia Cup 2023) నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ ప్రపంచ కప్(ODI World Cup 2023)పై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే.. దాయాది జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఆసియా కప్లో భారత జట్టుతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో గాయపడిన స్టార్ పేసర్ నసీం షా(Naseem Shah) ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనట. ఒకవేళ అదే జరిగితే ఈ యంగ్స్టర్ వన్డే వరల్డ్ కప్ మొత్తానికి దూరం అయ్యే చాన్స్ ఉంది. పాక్ పేస్ త్రయంలో ఒకడైన నసీం గాయం కారణంగా ఈ మెగా టోర్నీలో ఆడతాడా? లేదా? అనేది త్వరలోనే తెలియనుంది.
సెప్టెంబర్ 11న ఇండియాతో జరిగిన మ్యాచ్లో నసీం భుజం గాయమైంది. 46వ ఓవర్ సమయంలో నొప్పితో మైదానం వీడిన అతను ఆ తర్వాత బ్యాటింగ్కు కూడా రాలేదు. అదే మ్యాచ్లో గాయపడిన మరో పేసర్ హారిస్ రవుఫ్(Haris Rauf) కూడా బ్యాటింగ్కు రాలేదు. దాంతో ఇండియా 228 పరుగుల తేడాతో పాక్పై గెలుపొందింది. పాక్ జట్టు శ్రీలంకతో మ్యాచ్కు నసీం షా స్థానంలో పేసర్ జమాన్ ఖాన్(Zaman Khan)ను తీసుకుంది. నసీంకు దుబాయ్లో స్కానింగ్ నిర్వహించారు.
హారిస్ రవుఫ్, నసీం షా
అతడి భుజం గాయం ఇంతకుముందు కంటే ఎక్కువ ఉన్నట్టు తెలిసింది. దాంతో, ఈ యంగ్ పేసర్ ఏడాది పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ కప్తో పాటు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024కు కూడా నసీం అందుబాటులో ఉండకపోవచ్చు అని సమాచారం.
నసీం అనతికాలంలోనే పాకిస్థాన్ జట్టులో కీలకమైన ఫాస్ట్ బౌలర్గా ఎదిగాడు. అయితే.. చిన్నవయసులోనే పనిభారం వల్ల నసీం గాయాల పాలయ్యాడు. 18 నెలల క్రితం ఈ యంగ్స్టర్ వెన్నెముక గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత ఆడిన 14 వన్డేల్లో 32 వికెట్లతో సత్తా చాటాడు. శ్రీలంక వేదికగా అఫ్గనిస్థాన్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో దుమ్మురేపిన నసీం ఆసియా కప్లోనూ మెరిశాడు. లీగ్ దశలో ఇండియాపై మూడు వికెట్లతో చెలరేగాడు.