Waqar Younis : పాకిస్థాన్ లెజెండ్ వకార్ యూనిస్(Waqar Younis) భారత్పై మరోమారు నోరు పారేసుకున్నాడు. టీమిండియా(Team India) కంటే తమ జట్టు చాలా శక్తిమంతమైనదని కారుకూతలు కూశాడు. ఓవల్(Oval Stadium)లోనే భారత్ను చిత్తు చేశామని, టీమిండియాను ఏ గడ్డమీదనైనా ఓడించడం తమకు పెద్ద లెక్క కాదని చెప్పుకొచ్చాడు. ఆసియాకప్(Asia Cup 2023)లో భారత్ – పాక్ మరోమారు తలపడనున్న నేపథ్యంలో వకార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అతడి వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ విరుచుకపడుతున్నారు.
ఆసియాకప్లో భాగంగా సెప్టెంబరు 2న శ్రీలంక(Srilanka)లోని పల్లెకెలె స్టేడియం(Pallekele Stadium)లో భారత్-పాక్ మధ్య తొలిమ్యాచ్ జరుగనుంది. లాహోర్లో ఆసియాకప్ ట్రోఫీ ఆవిష్కరణలో వకార్ యూనిస్ మాట్లాడుతూ.. వీలైనంత సింపుల్గా ఆడాలని తమ జట్టుకు సూచించాడు. తమ కాలంలో మేజర్ టోర్నీలో భారత్పై అంతగా విజయాలు సాధించలేకపోయామని, కానీ ఇప్పుడు ఇండియాపై కుర్రాళ్లు కుమ్మేస్తున్నారని పాక్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘ఇది చాలా శుభసూచకం. జట్టులోని ప్రతి ఒక్కరిలో టాలెంట్ పుష్కలంగా ఉంది. ఇదే రీతిలో దంచికొడితే ఇండియాను ఎందుకు ఓడించలేం?’ అని వకార్ ప్రశ్నించాడు.
చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో భారత్పై గెలుపొందిన పాక్
2017లో ఇంగ్లండ్లోని ఓవల్(Oval Stadium)లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2017) ఫైనల్లో పాకిస్థాన్ 180 పరుగుల భారీ తేడాతో భారత్పై విజయం సాధించింది. ఓవల్లోనే భారత్ను మట్టికరిపించాం. కాబట్టి ఆ దేశాన్ని ఎక్కడైనా ఇట్టే ఓడించేయవచ్చని జట్టులో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు ఈ మ్యాచ్ను ఉదహరిస్తూ వకార్ పై వ్యాఖ్యలు చేశాడు.
నిరుడు ఆసియా కప్లో పాక్ను చిత్తు చేసిన టీమిండియా
నిరుడు ఆసియా కప్(Asia Cup 2022) ప్రారంభ మ్యాచ్లో భారత జట్టు పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఆ తర్వాత పుంజుకున్న పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్లో టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మేజర్ టోర్నీల్లో పాకిస్థాన్ సాధించిన ఒకటీ అరా విజయాలకే పొంగిపోతున్న వకార్ భారత్ జట్టును తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. దాంతో, అతడిపై భారత అభిమానులు విరుచుకుపడుతున్నారు. వరల్డ్ కప్(World Cup)లో పాక్పై టీమిండియా సాధించిన అద్భుత విజయాలను వకార్ మర్చిపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈసారి టీమిండియా శక్తి ముందు పాక్ నిలదొక్కుకోవడం కష్టమని.. గత టోర్నీలో దురదృష్టం కొద్దీ భారత్ ఓడిపోయింది తప్పితే చేవ లేక కాదని, ఈసారి కొట్టే కొట్టుడుకు పాక్ పత్తాలేకుండా పోతుందని వార్నింగ్ ఇస్తున్నారు.