Moin Khan : ఆసియా కప్(Asia Cup 2023) నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్(Pakistan) జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాజబర్ ఆజాం(Babar Azam) కెప్టెన్సీలో అంతా సవ్యంగా లేదని, ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పాక్ ఆటగాళ్లలో ఐక్యత లోపించిందంటూ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్(Moin Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బాబర్ కెప్టెన్సీ ఏమాత్రం బాగాలేదు. అతడు తన ప్లాన్ను పక్కాగా అమలు చేయలేకపోయాడు.
జట్టులోని ఏ ఒక్కరూ బాబర్కు సహకరించలేదు. వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్(Shadab Khan) సైతం దూరంగానే ఉన్నాడు. ఆఖరికి రిజ్వాన్ కూడా బాబర్ దగ్గరకు వెళ్లలేదు. ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా బయటపడింది. కానీ, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి ముందు ఆటగాళ్ల మధ్య ఐక్యత చాలా ముఖ్యం’ అని మోయిన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
భారత జట్టు చేతిలో 228 పరుగుల తేడాతో ఓడిన పాక్
వరల్డ్ నంబర్ 1గా ఆసియా కప్లో అడుగుపెట్టిన బాబర్ సేన లీగ్ దశలో అదరగొట్టింది. అదేంటో గానీ కీలకమైన సూపర్ 4 ఫైట్లో మాత్రం చతికిలపడింది. భారత్ అయితే ఏకంగా 228 పరుగుల తేడాతో దాయాదిని చిత్తుగా ఓడించింది. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై పాక్ 252 రన్స్ కొట్టింది. అయితే.. కుశాల్ మెండిస్(91) హాఫ్ సెంచరీ, చరిత అసలంక(49 నాటౌట్) వీరోచిత పోరాటంతో లంక అద్వితీయ విజయం సాధించింది.
లంకను గెలిపించిన అసలంక సంబురం
ఓటమి తప్పదనుకున్న దశలో అసలకం ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి జట్టును గెలిపించాడు. దాంతో, వరుసగా రెండోసారి ఫైనల్ చేరాలనకున్న బాబర్ సేన కల నెరవేరలేదు. ఆసియా కప్ నిష్క్రమణతో గుర్రుగా ఉన్న బాబర్ జట్టు సభ్యులతో మాట్లాడలేదట. అంతేకాదు షాహీన్ ఆఫ్రీదీ( Shaheen Afridi)కి, అతడికి డ్రెస్సింగ్ రూమ్లో వాగ్వాదం జరిగిందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.