Zohaib Rashid : పాకిస్థాన్ యువ బాక్సర్ జొహైబ్ రషీద్(Zohaib Rashid) దేశం పరువు తీశాడు. ఇటలీలో జరుగుతున్న ఒలింపిక్స్ క్వాలిఫయర్(Olympics Qualifiers)కు ఎంపికైన రషీద్ దొంగతనానికి పాల్పడ్డాడు. అది కూడా సొంత దేశానికి చెందిన ఆటగాళ్ల డబ్బును కాజేశాడు. అనంతరం చెప్పా పెట్టకుండా ఇటలీ నుంచి పరారయ్యాడు. మంగళవారం పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు ఇటలీలో ఉన్న పాకిస్థాన్ దౌత్యకార్యాలయంలో రషీద్పై ఫిర్యాదు చేసింది.
‘ఒలింపిక్స్ క్వాలిఫయర్ పోటీల్లో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ఐదుగురు సభ్యుల్లో రషీద్ ఒకడు. కానీ, అతడు దొంగతనానికి పాల్పడడం బాక్సింగ్ ఫెడరేషన్తో పాటు పాకిస్థాన్కు ఎంతో అవమానకరం. మహిళా బాక్సర్ లారా ఇక్రమ్(Laura Ikram) ట్రైనింగ్కు వెళ్లింది. అదే అదనుగా భావించిన రషీద్ డెస్క్ నుంచి ఆమె గది తాళాలు తీసుకున్నాడు.
జొహైబ్ రషీద్
ఆమె బ్యాగులోని విదేశీ కరెన్సీ దొంగిలించి టీమ్ హోటల్ నుంచి పారిపోయాడు’ అని జాతీయ సమాఖ్య సెక్రటరీ కల్నల్ నసీర్ అహ్మద్(Colonel Naseer Ahmed) ఓ ప్రకటనలో తెలిపాడు. పాక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఫిర్యాదుతో ఇటలీ పోలీసులు, పాకిస్థాన్ ఎంబసీ అధికారులు రషీద్ కోసం వేట మొదలెట్టారు.
Pakistani Boxer Embarrasses Own Country, Disappears After Stealing Money In Italyhttps://t.co/o45rgOwmr7 pic.twitter.com/r4ZRmq1C9i
— NDTV Sports (@Sports_NDTV) March 5, 2024
నిరుడు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో రషీద్ కాంస్య పతకం నెగ్గాడు. దాంతో, భావి బాక్సర్గా పాక్ మీడియా అతడిని ఆకాశానికెత్తేసింది. కానీ, అతడు మాత్రం తన పాడు బుద్దితో దేశం పరువు తీశాడు. దాంతో, రషీద్పై పాక్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.