హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని ఆదివారం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. లేక్ వ్యూ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సుమారు 400 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. 30+, 40+, 50+, 60+ 70+ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం అధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్తో పాటు జస్టిస్ రామకృష్ణ, పీవీ రావు, కేఎస్ఆర్, మోహన్ రావు, హరికృష్ణరెడ్డి, రమణ, సదాశివరెడ్డి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.