ఇస్లామాబాద్: ఇండో పాక్ క్రికెట్ అంటేనే ఓ టెన్షన్. ఆ ఉత్కంఠ పోరును కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షిస్తారు. ఇక ఆ సమయంలో ఆటగాళ్లలో ఉండే వత్తిడి కూడా అంతే. అయితే ఇండియన్ ఆటగాళ్లలో ఆ ప్రెజర్ను తట్టుకునే శక్తి ఇద్దరికే ఉన్నట్లు పాక్ మాజీ కెప్టెన్ హఫీజ్ తెలిపాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన అతను.. భారతీయ క్రికెటర్లపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లు అని, వాళ్లు రన్స్ స్కోర్ చేస్తుంటే ఎవరూ అడ్డుకోలేరని, అయితే ఈ ఇద్దరు కాకుండా, మిగితా ఇండియన్ ప్లేయర్లు వత్తిడిని తట్టుకోలేరని హఫీజ్ అన్నాడు.
మిగితా ప్లేయర్లు మేటి ఆటగాళ్లు కాదని అనడం లేదని, విరాట్ కానీ రోహిత్ కానీ ఔటైతే, ఆ టెన్షన్ను మిగితా ప్లేయర్లు ఎదుర్కోలేరని హఫీజ్ తెలిపాడు. వత్తిడిలో వాళ్లు ఆడలేరన్నారు. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో పాక్ చేతిలో ఇండియా దారుణంగా ఓడింది. ఇక ఏడాది జరిగే వరల్డ్కప్లోనూ మళ్లీ రెండు జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 23న మెల్బోర్న్లో జరగనున్న ఆ మ్యాచ్కు ఇప్పటి నుంచే ఆసక్తి రేగుతోంది. ఇండోపాక్ మ్యాచ్లు చాలా ఆడానని, తొలి మ్యాచ్ ఓడితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే, అప్పుడు బాడీ లాంగ్వేజ్ మారుతుందని హఫీజ్ చెప్పాడు.