Cricket Betting | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 8న కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ ఎస్ఒటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న మరో ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్రావు అలియాస్ చిన్ను లండన్లో స్థిరపడ్డాడు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇతడికి అదే జిల్లా వాసి అలూరు త్రినాధ్(34), మనం రాజేష్, బొల్లె స్వామి(30), మర్పెన్న గణపతిరావు(57)లు బుకీలుగా వ్యవహరిస్తూ సహకరిస్తున్నారు. ఐపీఎల్-2024 క్రికెట్ మ్యాచ్లపై ‘క్రికెట్ లైవ్ గురు’, ‘లక్కీ ఆన్లైన్’ యాప్ల ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో త్రినాధ్తో పాటు రాజేష్, స్వామి, గణపతిరావును అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.43.57లక్షల నగదుతో పాటు 8 ఖరీదైన స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, ట్యాబ్ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.