KL Rahul : ఫిఫా వరల్డ్కప్ ఫైనల్ ఎప్పుడెప్పుడు ప్రారంభం కానుందా? అని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. క్రికెటర్లు, సినిమా తారలు, టెన్నిస్ ప్లేయర్స్ కూడా ఫైనల్ పోరుపై ఆసక్తితో ఉన్నారు. దాంతో ఎక్కడ చూసినా టైటిల్ ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్న వినిపిస్తోంది. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్పై విజయం అనంతరం రాహుల్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ‘మేము మద్దతు ఇచ్చిన రెండు టీమ్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మా జట్టులో కొందరు బ్రెజిల్, మరికొందరు ఇంగ్లండ్ జట్టు అభిమానులు ఉన్నారు. అందుకని వరల్డ్ కప్ ఫైనల్లో ఏ జట్టులో అర్జెంటీనా, ఫ్రాన్స్ను ఎవరెవరు సపోర్టు చేస్తారో నాకైతే కచ్చితంగా తెలియదు. ఏ టీమ్కు మద్దతు ఇవ్వాలనే విషయంలో మేము విడిపోతాం. కానీ, అందరం కలిసి మ్యాచ్ చూస్తాం’ అని రాహుల్ చెప్పాడు. మొదటి టెస్టు విజయంతో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు డిసెంబర్ 22న జరగనుంది. దాంతో రిపోర్టర్లు అయోమయంలో పడ్డారు. ఈ రోజు రాత్రి 8ః30 గంటలకు లూసెయిన్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
2018 వరల్డ్ కప్ విజేత అయిన ఫ్రాన్స్ ఈసారి కూడా కప్పు కొట్టాలనే ఆలోచనతో ఉంది. వరుసగా రెండు ప్రపంచ కప్ టోర్నీ సాధించిన జట్టుగా రికార్డు సాధించాలని తహతహలాడుతోంది. మరోవైపు మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా అదరిపోయే ప్రదర్శన కనబరుస్తోంది. మొదటి మ్యాచ్లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత అద్భుతంగా పుంజుకుంది. మెస్సీకి ఇదే చివరి వరల్డ్ కప్. దాంతో టైటిల్తో కెరీర్కు ఘనంగా ముగింపు పలకాలని అతను భావిస్తున్నాడు. మొదటి సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0తో క్రొయేషియాపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో సెమీఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోను ఓడించింది.