Arshad Nadeem : పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం కొల్లగొట్టిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ (Arshad Nadeem) స్వదేశంలో స్వాగత, సత్కారాలతో బిజీ అయ్యాడు. పలవురు క్రికెటర్లు, వ్యాపారవేత్తలు నదీమ్కు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లష్కరే తోయిబా (Lashkar e Taiba) ఉగ్రవాది హారిస్ ధార్ (Hariis Dhar) ఒలింపిక్ విజేత నదీమ్ పక్కనే కూర్చొని ఉన్నాడు.
‘ఇదేంటీ.. వీరిద్దరు ఎప్పుడు కలిశారు? అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ వీడియో పారిస్ ఒలింపిక్స్ తర్వాత తీసిందా? అంతకంటే ముందే తీసిందా? అనేది తెలియాల్సి ఉంది. పాక్ ప్రభుత్వం, పాక్ మీడియాగా ఈ వీడియోపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరం.
🚨🚨🚨Big Expose:
The sinister connection between Pak sportsman Arshad Nadeem & UN designated terrorist organisations fin sec Harris Dhar (Lashkar-e-Taiba)
📍It’s evident from their conversation that this video is very recent after Arshad Nadeem’s return from the Paris Olympics… pic.twitter.com/ko8OlJ81ct
— OsintTV 📺 (@OsintTV) August 12, 2024
పాక్లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆర్దిక లావాదేవీలను హ్యారిస్ చూసుకుంటున్నాడు. దాంతో, ఐక్యరాజ్య సమితి(UNO) అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే.. నదీమ్ను అతడు ఎప్పుడు కలిశాడు? అనేదానిపై స్పష్టత లేదు. ఒలింపిక్స్ తర్వాత నదీమ్కు ఏర్పాటు చేసిన సన్మాన సభలోనే ఇద్దరూ కలిశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్లో రికార్డు త్రోతో నదీమ్ స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. ఫైనల్లో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పాక్కు తొలి పసిడిని అందించాడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో పసిడిని ముద్దాడిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) .. పారిస్లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి వరుసగా రెండో పతకంతో చరిత్ర లిఖించాడు.