ఒలింపియా: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్కు ముందు విశ్వక్రీడల పుట్టినిల్లు అయిన గ్రీస్లోని ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
మంగళవారం వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఒలింపియాలోని 2600 ఏండ్ల నాటి హీరా ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటి మేరి మిన జ్యోతి ప్రజ్వలన చేసి దానిని టోక్యో ఒలింపిక్స్లో రోయింగ్ విజేత స్టెఫనోస్కు అందించింది.