పుణె : అల్టిమేట్ ఖోఖోలో ఒడిశా జగ్గర్నాట్స్ అజేయంగా సాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో ఒడిశా 9 పాయింట్ల తేడాతో తెలుగు యోధాస్ను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. ఒడిశాకిది వరుసగా ఆరో విజయం. ఒడిశా ఆటగాడు సూరజ్ లడె నలుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను అవుట్ చేసి పది పాయింట్లు సాధించాడు. కాగా విశాల్ డిఫెన్స్లో 3.53 నిమిషాలపాటు ప్రత్యర్థులకు చిక్కకుండా ఆరు బోనస్ పాయింట్లు సాధించాడు.
ఒక దశలో వెనుకంజలో ఉన్న ఒడిశా అనూహ్యంగా పుంజుకుని 43-39 స్కోరుతో విజయాన్నందుకుంది. ఈ విజయంతో ఒడిశా మరో మూడు పాయింట్లను కూడగట్టుకుని మొత్తం 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నది. గుజరాత్ జెయింట్స్ 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. సోమవారం తెలుగు యోధాస్-గుజరాత్ జెయింట్స్, చెన్నై క్విక్గన్స్-ముంబయి ఖిలాడీస్ తలపడతాయి.