Shubman Gill | డెంగ్యూ జ్వరంతో ఆదివారం ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్కు దూరమైన టీం ఇండియా ఓపెనర్ శుభ్మన్ గిల్.. మరో మ్యాచ్కు కూడా దూరంగా ఉండనున్నాడు. ఆఫ్ఘనిస్థాన్తో జరిగే మ్యాచ్కు కూడా శుభ్మన్ గిల్ దూరంగానే ఉంటాడని బీసీసీఐ ధ్రువీకరించింది.
‘డెంగ్యూ జ్వరం వల్ల ఈ నెల తొమ్మిదో తేదీన టీంతోపాటు ఢిల్లీకి శుభ్ మన్ గిల్ రాలేకపోయాడు. దీనివల్ల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ కూ దూరం అయ్యాడు. అ నెల 11న ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే మ్యాచ్ కూ శుభ్ మన్ గిల్ దూరమే’ అని బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
శుభ్ మన్ గిల్ లేకపోవడంతో సారధి రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఆదివారం ఓపెనర్గా వచ్చాడు. ఆఫ్ఘనిస్థాన్తో జరిగే మ్యాచ్లోనూ ఇషాన్ కిషన్ ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీం ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా.. రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయినా.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు.
24 ఏండ్ల శుభ్ మన్ గిల్.. ఏడాది కాలంగా మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఐదు వన్డేల్లో సెంచరీలు చేసిన శుభ్ మన్ గిల్.. 12 ఏండ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోర్నీ గెలుచుకోవడంలో కీలకం అవుతాడని భావిస్తున్నారు.