ODI World Cup | ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్తో టోర్నీ షురూకానున్నది. భారత జట్టు తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనున్నది. అక్టోబర్ 15న అహ్మదాబాద్లో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరుగనున్నది. నవంబర్ 15న ముంబైలో తొలి సెమీఫైనల్, నవంబర్ 16న కోల్కతాలో రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.
19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది. అయితే, పాక్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి. ముసాయిదా షెడ్యూల్ను చూసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వేదికలను మార్చాలని ఐసీసీ, బీసీసీఐలను కోరగా.. ఇందుకు అనుమతించలేదు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్తో జరిగే మ్యాచ్లకు సంబంధించిన వేదికలను మార్చాలని పీసీబీ డిమాండ్ చేశారు.
అక్టోబరు 20న బెంగళూరులోని చిన్నస్వామిలో ఆస్ట్రేలియాతోనూ, 23న చెన్నైలోని చెపాక్లో ఆఫ్ఘనిస్థాన్తోనూ పాకిస్థాన్ తలపాడాల్సి ఉంది. చెన్నైలో పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భయపడుతోంది. చెపాక్ స్టేడియంలో రషీద్ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ వంటి స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఆందోళనకు గురవుతున్నది. అదే సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలగా ఉంటుంది.
దాంతో ఆస్ట్రేలియా వంటి జట్టుతో పోటీపడాల్సి రావడంతో భయం పట్టుకున్నది. అందుకే రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలని డిమాండ్ చేస్తున్నది. వేదికలను మారిస్తే పాక్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో పీసీబీ డిమాండ్ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి. రెండు మ్యాచ్లను ముందుగా నిర్ణయించిన వేదికల్లోనే ఆడాలని స్పష్టం చేశాయి. వరల్డ్ కప్లో పాక్ అక్టోబర్ 6న క్వాలిఫయర్-1 జట్టుతో టోర్నీని ప్రారంభించనున్నది. హైదరాబాద్లో రెండు మ్యాచ్లు, అహ్మదాబాద్లో ఒకటి, బెంగళూరులో రెండు, చెన్నైలో రెండు, కోల్కతాలో రెండు మ్యాచ్లు పాక్ ఆడాల్సి ఉంటుంది.