న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా శనివారం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లు దంచి కొడుతున్నారు. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ పరుగుల వరద పారిస్తున్నారు. ఫోర్లు, సిక్సర్లతో న్యూజిలాండ్ ఫీల్డర్లను మైదానం అంతటా పరుగులు పెట్టిస్తున్నారు. దాంతో 23 ఓవర్లకే ఆస్ట్రేలియా జట్టు స్కోరు 200 పరుగుల మైలురాయికి చేరుకుంది.
డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో 81 పరుగులు (6 సిక్సర్లు, 5 ఫోర్లు) చేసి 20వ ఓవర్ తొలి బంతికే గ్లెన్ ఫిలిప్స్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 175/0. ట్రావిస్ హెడ్ 53 బంతుల్లో 91 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 23వ ఓవర్ పూర్తయ్యే సరికి జట్టు స్కోర్ 200 పరుగులకు చేరింది. అప్పటి ట్రావిస్ హెడ్ 109 పరుగులతో, మిచెల్ మార్ష్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆ తర్వాత 24వ ఓవర్ రెండో బంతికి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లోనే ట్రావిస్ హెడ్ 109 (65 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్లు) బౌల్డయ్యాడు.
ఆ తర్వాత 30వ ఓవర్ నాలుగో బంతికి స్టీవెన్ స్మిత్ 18 (17 బంతుల్లో 2 ఫోర్లు) గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లోనే బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ మూడు టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టి ఆసీస్ దూకుడుకు కళ్లెం వేశాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 30 ఓవర్లలో 230 పరుగులు. మిచెల్ మార్ష్ 17 పరుగులు, మార్నస్ లబుషేన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.