న్యూఢిల్లీ: చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం 33 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడలు ముగసిసిన తర్వాత కొరియాలో అక్టోబర్ 22 నుంచి జరుగనున్న ఆసియా షూటింగ్ టోర్నీకి 35 మంది షూటర్లను ఎంపిక చేశారు.
అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్ రెండు జట్లలో చోటు దక్కించుకుంది. మెగాటోర్నీలో తొలిసారి ప్రాతినిధ్యం వహించబోతున్న ఇషా..ఎలాగైనా పతకం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీ అయిన ఏషియన్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు మరిన్ని బెర్తులు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏడు బెర్తులు దక్కించుకోగా, మిగతా విభాగాల్లో సత్తాచాటేందుకు భారత షూటర్లు సిద్ధమవుతున్నారు.