IPL 2023 : ఐపీఎల్(IPL) ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు గుడ్న్యూస్. విధ్వంసక ఆల్రౌండర్ లియాం లివింగ్స్టోన్ (Livingstone) పదహారో సీజన్లో ఆడేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఐపీఎల్ 2023లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ (ECB), వేల్స్ క్రికెట్ బోర్డు అతడికి అనుమతి ఇచ్చాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే..? ఓపెనర్ జానీ బెయిర్స్టో(Jonny Bairstow)కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా..? గత ఏడాది అక్టోబర్లో బెయిర్స్టో కాలికి, మోకాలుకు సర్జరీ చేయించుకున్నాడు. అతను మరో రెండు వారాల్లో ప్రాక్టీస్ మొదలుపెడతాడు. అయితే.. అతను ఫిట్నెస్ సాధించేందుకు మరింత సమయం పట్టనుంది.
అందుకని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ స్టార్ ఓపెనర్కు ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న యాషెస్ సిరీస్కు బెయిర్స్టో చాలా కీలకం. కాబట్టి అతడు మళ్లీ గాయపడకుండా, అతడిపై ఒత్తిడి పడకుండా చూడడం కోసం ఐపీఎల్కు అనుమతి ఇవ్వడం లేదని తెలస్తోంది.
2022 మినీ వేలంలో బెయిర్స్టోను రూ.6.75కోట్లకు, లివింగ్స్టోన్ను రూ.11.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. విధ్వంసక బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే లివింగ్స్టోన్, బెయిర్స్టో పంజాబ్ కింగ్స్కు చాలా కీలకం. వీళ్లపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్లో చెత్త రికార్డు ఉన్న పంజాబ్ కింగ్స్ ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. అందుకని ఈసారి వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ కోసం ఏకంగా 18.50 కోట్లు పెట్టింది.
మార్చి 31న పదహారో సీజన్ ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈసారి లీగ్ మరింత స్పెషల్ ఉండనుంది. ప్రతి జట్టు సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్లు ఆడనుంది. అంతేకాదు టాస్ గెలిచాక తుది జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇంప్యాక్ట్ ప్లేయర్ను కూడా తీసుకునేందుకు వీలుంది.