Vinesh Phogat | పారిస్ ఒలింపిక్స్లో భారత్కు షాక్ తగిలింది. రెజ్లింగ్ ఫైనల్కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పతకం ఆశలు గల్లంతయ్యాయి. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్కు చేరిన ఫొగాట్పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్కు గురి చేస్తోంది.
ఈ అంశం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు వార్త నిజం కాకుంటే బాగుండు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘నోనోనో.. ఇది ఓ పీడకల అయితే బాగుండు..’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
NO! NO! NO!
Please make this a bad dream that I will wake up from and find it isn’t true… https://t.co/T5BLQCkLVI
— anand mahindra (@anandmahindra) August 7, 2024
కాగా, రెజ్లింగ్ ఫైనల్కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే (Olympic disqualification). 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో పోటీ చేసిన వినేశ్ ఫొగాట్.. ఫైనల్కి ప్రవేశించింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్కు చేరింది. దీంతో అంతా పతకం ఖాయమని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా బరువు పెరిగిన కారణంగా ఫొగాట్పై అనర్హత వేటు పడింది. ఫైనల్ గేమ్కు కొద్ది క్షణాల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.
నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఫొగాట్ 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. ఫొగాట్పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్కు గురి చేస్తోంది.
Also Read..
Vinesh Phogat | తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వినేశ్ ఫొగాట్..?