న్యూఢిల్లీ: ఐపీఎల్ విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ తదుపరి సిరీస్లపై దృష్టి పెట్టింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఈనెల 5వ తేదీన ఢిల్లీలో కలువనుండగా, గురువారం దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడకు చేరుకోనుంది.
ఐపీఎల్ లాగే ఈ సిరీస్కు కరోనా నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టారు. ప్రేక్షకుల హాజరుపై పరిమితులు, బయోబబుల్ వంటి ఆంక్షలను ఎత్తేశారు. కాకపోతే ఆటగాళ్లకు విధిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ‘దక్షిణాఫ్రికా బృందం 2న, భారత జట్టు 5న ఢిల్లీకి చేరుకోనుంది’ అని డీడీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.