IPL 2024: మరికొద్దిరోజుల్లో మొదలుకావాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ భారత్లోనే జరుగుతుందా..? మార్చి 22 (అధికారికంగా ప్రకటించలేదు) నుంచి మే చివరి వారం దాకా జరగాల్సి ఉన్న ఈ మెగా లీగ్ను భారత్లో సాధారణ ఎన్నికల దృష్ట్యా విదేశాల్లో నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహకాలు చేస్తున్నదని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ను తమ దేశంలో నిర్వహించాలని శ్రీలంక ఇదివరకే భారత్ను కోరింది. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎల్ భారత్లోనే జరుగుతుందా..? షిఫ్ట్ అవుతుందా..? అన్నదానిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు రాజీవ్ శుక్లా ఓ జాతీయ వెబ్సైట్తో మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో (ఐపీఎల్ వేదిక మార్పు) మేం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ భారత్లోనే జరుగుతుందా..? లేక షిఫ్ట్ అవుతుందా..? అనేది సెంట్రల్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ నిర్ణయించాల్సి ఉంది. అయితే ఏ విషయమైనా చర్చల తర్వాతే తెలుస్తుంది..’ అని అన్నాడు.
ఇక వచ్చేనెల నుంచి మొదలుకానున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ఈసారి రెండు నగరాల్లో నిర్వహించనున్నట్టు శుక్లా స్పష్టం చేశాడు. గత సీజన్లో ఒక్క ముంబైలోనే జరిగిన మ్యాచ్లను ఈసారి బెంగళూరు, ఢిల్లీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపాడు.