Nitish Kumar Reddy | ముల్లాన్పూర్: పంజాబ్ కింగ్స్తో మంగళవారం ముగిసిన మ్యాచ్లో ఆల్రౌండ్షో తో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్లో అర్ధ సెంచరీ చేయడమే గాక బౌలింగ్లో ఒక వికెట్ తీసి ఫీల్డింగ్లో క్యాచ్ పట్టిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డులకెక్కాడు.
పంజాబ్తో మ్యాచ్లో 37 బంతుల్లోనే 64 పరుగులు చేసిన నితీశ్.. బౌలింగ్లో జితేశ్ శర్మ వికెట్ తీశాడు. ఫీల్డింగ్ చేస్తూ ప్రభ్సిమ్రన్ క్యాచ్ను అందుకున్నాడు.