వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో హైదరబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. సెమీ ఫైనల్లో బ్రెజిల్ బాక్సర్పై సునాయాస విజయం సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపించిన ఆమె.. బ్రెజిల్కు చెందిన కరోలైన్ డి అల్మేడాను 5-0 పాయింట్ల తేడాతో ఓడించింది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో గెలిచిన నిఖత్ జరీన్.. ఫైనల్లో అడుగు పెట్టింది.
ఇప్పటి వరకు భారత్లో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా సీ మాత్రమే ప్రపంచ టైటిల్స్ సాధించిన మహిళా బాక్సర్లు కావడం గమనార్హం. ఇప్పుడు ఈ అవకాశం నిఖత్ జరీన్ చేతుల్లో ఉంది. ఫైనల్లో కూడా ఇలాంటి ప్రదర్శనే చేస్తే కచ్చితంగా స్వర్ణ పతకం ఆమె సొంతమవుతుంది. కాసేపట్లో భారత బాక్సర్లు మనీషా మౌన్ (57 కేజీల విభాగం), ప్రవీణ్ హుా (63 కేజీల విభాగం) కూడా తమ తమ సెమీఫైనల్ మ్యాచులు ఆడతారు.