India Vs SA ODI | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీం ఇండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే పెవిలియన్ దారి పట్టాడు. దక్షిణాఫ్రికా బౌలర్ నిగిడి బౌలింగ్లో 27 ఓవర్ బంతిని నేరుగా రబడాకు క్యాచ్ ఇవ్వడంతో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ సింది. ఐదు వికెట్ల నష్టానికి టీం ఇండియా 118 పరుగులు చేసింది.
అంతకుముందు 36 బంతుల్లో 8 ఫోర్లతో అయ్యర్ తన అర్థ సెంచరీ కంప్లీట్ చేశాడు. గురువారం జరుగుతున్న మ్యాచ్లో 26వ ఓవర్లో మహరాజ్ వేసిన చివరి బంతిని ఆడటంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే ఓవర్లో నాలుగో బంతిని ఫోర్గా మార్చిన శ్రేయస్.. డిఫెన్స్కు ప్రాధాన్యం ఇచ్చాడు. టీం ఇండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ 26వ ఓవర్ చివరి బంతిని సింగిల్గా మల్చడంతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అంతకుముందు 24 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. టీం ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 250 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో ఒత్తిడికి గురైన టీం ఇండియా ప్లేయర్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. 8 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు ఔటై క్రీజ్ను వీడారు.
కానీ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి కేవలం 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి టీం ఇండియా కష్టాల్లో చిక్కుకుంది. వన్డౌన్గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. షంషీ బౌలింగ్లో డికాక్ చేతిలో స్టంపవుట్ అయ్యాడు. ఔటయ్యే సమయానికి గైక్వాడ్ 19 పరుగులు చేశాడు. ఇషాన్ కిషాన్ 20 పరుగులు, గైక్వాడ్ 19 పరుగులతో కాస్త నిలకడగా ఆడారు. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ 17, సంజూ శాంసన్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.