Newzeanland : న్యూజిలాండ్ జట్టు పదేళ్ల తర్వాత బంగ్లాదేశ్(Bangladesh) గడ్డపై అడుగుపెడుతోంది. వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) కంటే ముందు వన్డే, టెస్టు సిరీస్ కోసం త్వరలోనే బంగ్లాకు బయలుదేరనుంది. ఈ విషయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) ధ్రువీకరించింది. కివీస్ 2013లో చివరిసారిగా బంగ్లా పర్యటనకు వెళ్లింది. అప్పుడు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ డ్రాగా ముగిసింది. అయితే.. వన్డేల్లో అదరగొట్టిన బంగ్లా 3-0తో బ్లాక్క్యాప్స్ను వైట్వాష్ చేసింది. అయితే.. టీ20 విజయంతో కివీస్ జట్టు పర్యటనను ముగించింది.
దాంతో, పదేళ్ల క్రితం ఓటమికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ఇరుజట్లు మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే.. టెస్టు సిరీస్ మాత్రం మాత్రం వరల్డ్ కప్ తర్వాత జరుగనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో ఇరుజట్లకు ఈ టూర్ కీలకం కానుంది. వన్డే మ్యాచ్లన్నీ మిర్పూర్లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం(Sher-e-Bangla National Cricket Stadium)లో జరుగనున్నాయి. సెప్టెంబర్ 21న మొదటి వన్డే, సెప్టెంబర్ 23న రెండో వన్డే, సెప్టెంబర్ 26న మూడో వన్డేలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఢీ కొంటాయి. మొదటి టెస్టు మ్యాచ్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు, రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే.. టెస్ట్ మ్యాచ్ల వేదికలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
న్యూజిలాండ్ జట్టు
నాలుగేళ్ల క్రితం రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ ఈసారి ట్రోఫీపై కన్నేసింది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభ మ్యాచ్లో 2019 ఫైనలిస్ట్ ఇంగ్లండ్తో కివీస్ తలపడనుంది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు అక్టోబర్ 7న ధర్మశాల వేదికగా అఫ్గనిస్థాన్ను ఢీ కొననుంది. బంగ్లా ఈసారి షకిబుల్ హసన్(Shakib Al Hasan) కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. తమీమ్ ఇక్బాల్ తప్పుకోవడంతో మళ్లీ ఈ స్టార్ ఆల్రౌండర్ వన్డే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.