Dravid – Jai Shah : ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కోసం నిరీక్షిస్తున్న టీమిండియా(Team India)కు ఈసారి సువర్ణావకాశం దొరికింది. సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. దాంతో, ప్రపంచ కప్ జట్టు ఎంపికపై ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)తో బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) ఈమధ్యే సమావేశమయ్యాడు. స్పెయిన్లోని మియామిలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు.
ఆసియా కప్(Asia Cup 2023), స్వదేశంలో ప్రపంచ కప్(ODI World Cup 2023)లో అనుసరించాల్సిన ప్రణాళికలపై మాట్లాడినట్టు సమాచారం. అంతేకాదు కోచింగ్ సిబ్బంది పెంపు, రెండు ఫార్మాట్లకు ప్రత్యేక కోచ్ల నియామకం గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
వెస్టిండీస్ పర్యటన(West Indies Tour )లో అదరగొట్టిన భారత్ టెస్టు, వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే.. ఐదో టీ20లో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. దాంతో, పొట్టి ఫార్మాట్లో అతడి కోచింగ్ ఏమాత్రం బాగాలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. అందుకని టీ20 జట్టకు మరొక కోచ్ ఉండాలని మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్(Parthiv Patel), మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్(Venkatesh Prasad)లు అభిప్రాయపడ్డారు. మ్యాచ్ అనంతరం ద్రవిడ్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. లోయర్ ఆర్డర్లో పరుగులు సాధించగల బ్యాటర్లు లేకపోడం భారత్ను వేధిస్తోందని అన్నాడు.
టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు