Arshdeep Singh : టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh)ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. మరో రెండు వికెట్లు తీస్తే భారత జట్టు తరఫున టీ20ల్లో తక్కువ ఇన్నింగ్స్ల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. అంతేకాదు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) రికార్డును బద్ధలు కొడతాడు. అవును.. 2019లో బుమ్రా 41 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించాడు. అర్ష్దీప్ మాత్రం 31 ఇన్నింగ్స్ల్లోనే 48 వికెట్లు తీశాడు. ఐర్లాండ్తో మూడు టీ20 సిరీస్లో అతను 50 వికెట్ల మైలురాయికి చేరే అవకాశం ఉంది. కాకపోతే మొదటి మ్యాచ్లోనా, రెండో మ్యాచ్లోనా అనేది తెలియాలి.
టీ20 స్పెషలిస్ట్ అయిన అర్ష్దీప్ ఐర్లాండ్ సిరీస్(Ireland Series)కు ఎంపికయ్యాడు. బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు నిన్ననే ఐర్లాండ్కు బయలు దేరింది. ఇరుజట్ల మధ్య మొదటి టీ20 ఆగస్టు 18న మొదలవ్వనుంది. ఈ సిరీస్తో యార్కర్ కింగ్ బుమ్రా పునరాగమనం చేస్తున్నాడు. ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ వంటి మెగాటోర్నీలో బుమ్రా, అర్ష్దీప్ సింగ్ కీలకం కానున్నారు. అయితే.. ఈ సిరీస్లో వీళ్లు ఎలా రాణిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
భారత బృదం : జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, శివం దూబే, షహబాజ్ అహ్మద్, సంజూ శాంసన్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.
భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల పొట్టి సిరీస్ ఆగస్టు 18న మొదల్వనుంది. రెండో మ్యాచ్ 20న, మూడో టీ20 23వ తేదీన జరుగనున్నాయి. ఆసియా కప్(Asia Cup), వన్డే వరల్డ్ కప్(odi wc 2023) వంటి మెగా టోర్నీలకు ముందు జరుగుతున్న ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు ఎంతో కీలకం.