లండన్: సీనియర్ పేసర్ టిమ్ సౌథీ (6/43) ఆరు వికెట్లతో విజృంభించడంతో తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్పై న్యూజిలాండ్ పైచేయి సాధించింది. ఓపెనర్గా వచ్చిన రోరి బర్న్స్ (132) చివరి వరకు పోరాడి శతకం చేయడం మినహా మిగిలిన వారు ఆకట్టుకోలేకపోవడంతో నాలుగో రోజు ఆటలో ఇంగ్లిష్ జట్టు 275 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో కివీస్ ఆట ముగిసే సరికి 62/2 స్కోరు చేసింది.