ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా.. 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. కివీస్తో తొలి వన్డేలో తలపడుతున్నది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్.. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్కు టీం మేనేజ్మెంట్ మెంట్ విశ్రాంతినివ్వడంతో టీమ్ఇండియాకు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్ను సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్తో అర్ష్దీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశారు. ధవన్తో పాటు శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ఆరంభించాడు.
భారత జట్టు: ధవన్ (కెప్టెన్), గిల్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, సంజూ శామ్సన్, సుందర్, శార్దూల్, అర్ష్దీప్, చాహల్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, కాన్వే, లాథమ్, మిషెల్, ఫిలిప్స్, శాంట్నర్, ఆడమ్ మిలెన్, సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్.