మౌంట్ మౌంగనుయి: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 529 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలు 247 పరుగులకే పరిమితమయ్యారు. కైల్ జెమీసన్(4/58), సాంట్నర్ (3/59) ధాటికి సఫారీ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. డేవిడ్ బెడింగ్హామ్(87), జుబైర్ హమ్జా(36) మినహా అందరూ స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు.
సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ కివీస్ బౌలర్లు ఆది నుంచే చెలరేగడంతో దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అంతకముందు ఓవర్నైట్ స్కోరు 179/4 వద్దే రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన కివీస్..సఫారీలకు భారీ సవాలు విసిరింది. డబుల్ సెంచరీతో విజృంభించిన రచిన్ రవీంద్రకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మంగళవారం నుంచి మొదలుకానుంది.