మౌంట్ మాంగనీ: మీడియం పేసర్ ఇబాదత్ హుసేన్ (4/39) రాణించడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. విదేశీ గడ్డపై చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన బంగ్లా.. బౌలింగ్లోనూ సత్తాచాటడంతో మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విల్ యాంగ్ (69) అర్ధశతకం సాధించాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 401/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా.. చివరకు 458 పరుగులకు ఆలౌటైంది. బుధవారం ఆటకు చివరి రోజు కాగా.. చేతిలో ఐదు వికెట్లు ఉన్న కివీస్.. ప్రస్తుతం బంగ్లా స్కోరు కంటే 17 పరుగుల ముందంజలో ఉంది. న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలువని బంగ్లాకు ఇది సువర్ణావకాశం కాగా.. క్రీజులో ఉన్న కివీస్ సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్ (101 బంతుల్లో 37) ఏమాత్రం పోరాడుతాడో చూడాలి.