వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటన భారత జట్టులోని యువ ఆటగాళ్లకు మంచి అవకాశమని ఈ సిరీస్లో టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకోవడానికి, తాము ఏ పొజిషిన్తో సెట్ అవుతామో అనే విషయంలో క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ టోర్నీ చక్కగా ఉపయోగపడుతుందని చెప్పాడు.
న్యూజిలాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్లో జరుగాల్సి ఉంది. ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరుగాల్సి ఉండగా వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఒక్క బంతికూడా పడకుండానే రద్ధయ్యింది. మరో టీ20 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాగా, టీ20 సిరీస్ అనంతరం శిఖర్ ధవన్ సారథ్యంలోని వన్డే స్క్వాడ్ వన్డే సిరీస్ ఆడనుంది.
ఈ టోర్నీకి సీనియర్ ప్లేయర్లందరికీ విశ్రాంతినిచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి హేమాహేమీల గైర్హాజరీలో న్యూజిలాండ్లో భారత్ టీ20, వన్డే సిరీస్లు ఆడుతున్నది. టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా, వన్డే జట్టుకు శిఖర్ ధవన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.