అడిలైడ్: టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్.. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్పై విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చావుతప్పి కన్నులొట్టబోయినట్లు నెగ్గిన ఆతిథ్య ఆసీస్.. గ్రూప్-1లో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మొదట 20 ఓవర్లలో ఆసీస్ 8 వికెట్లకు 168 రన్స్ చేసింది. మ్యాక్స్వెల్ (32 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. నవీన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్గాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 రన్స్ చేసింది. రషీద్ ఖాన్ (23 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డా జట్టును గెలిపించలేకపోయాడు.