అక్లండ్ : శ్రీలంకతో శనివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో 274 పరుగులు చేయగా, సమాధానంగా శ్రీలంక 19.5 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. కివీస్ జట్టులో ఫిన్ అలెన్ అత్యధికంగా 51 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 49, డారిల్ మిచెల్ 47, గ్లెన్ ఫిలిప్స్ 39, విల్ యంగ్ 26 పరుగులు చేశారు. కరుణరత్నె 4, కసున్ రజిత , లాహిరు కుమార చెరి 2 వికెట్లు పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో ఆంజెలో మాథ్యూస్(18), చమిక కరుణరత్నె(11), లాహిరు కుమార(10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. హెన్రి షిప్లే 31 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి కివీస్కు విజయాన్ని చేకూర్చాడు.