రాంచీ: వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్కు న్యూజిలాండ్ చేతిలో తొలి ఓటమి ఎదురైంది. వన్డే సిరీస్ వైట్వాష్ ఎదుర్కొన్న కివీస్ పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియాకు చెక్ పెట్టింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 1-0తో ముందంజ వేసింది. కివీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 155/9 స్కోరుకు పరిమితమైంది. టాప్ త్రీ..శుభ్మన్ గిల్(7), ఇషాన్ కిషన్(4), రాహుల్ త్రిపాఠి(0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(47), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21) ఒకానొక దశలో కుదురుకున్నా..మ్యాచ్ను గెలిపించలేకపోయారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు 68 పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పారు. అయితే ఆరు పరుగుల తేడాతో వీరిద్దరు ఔట్ కావడం జట్టు గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.
ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్(50) అర్ధసెంచరీతో రాణించినా..సహచరుల నుంచి సరైన సహకారం కరువైంది. రెండుసార్లు క్యాచ్ ఔట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న సుందర్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. బ్రేస్వెల్, సాంట్నర్, ఫెర్గుసన్ రెండేసి వికెట్లు తీశారు. తొలుత కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. డారిల్ మిచెల్(59 నాటౌట్), డెవాన్ కాన్వె(52) అర్ధసెంచరీలతో రాణించారు. ముఖ్యంగా కాన్వె, ఫిలిప్స్(17) కలిసి మూడో వికెట్కు 60 పరుగులు జోడించారు. ఆఖర్లో మిచెల్ దూకుడుగా ఆడటంతో కివీస్కు పోరాడే స్కోరు దక్కింది. సుందర్(2/22) రెండు వికెట్లు తీయగా, అర్ష్దీప్సింగ్, కుల్దీప్యాదవ్, శివమ్ మావి ఒక్కో వికెట్ తీశారు. మిచెల్కు ‘మ్యాన్ ఆఫ్ ధ మ్యాచ్’ దక్కింది.
ఓవర్లలో 176/6(మిచెల్ 59 నాటౌట్, కాన్వె 52, సుందర్ 2/22, మావి 1/19), భారత్: 20 ఓవర్లలో 155/9 (సుందర్ 50, సూర్యకుమార్ 47, సాంట్నర్ 2/11, బ్రేస్వెల్ 2/31)