న్యూజిలాండ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3.4 ఓవర్లలో 24 పరుగులు చేసింది. అయితే.. గప్తిల్.. బుమ్రా బౌలింగ్లో బంతిని పైకి లేపాడు. దీంతో శార్ధూల్ ఠాకూర్ క్యాచ్ పట్టాడు. 17 బంతుల్లో గప్తిల్.. 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మిచెల్ 5 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. ప్రస్తుతం క్రీజులో మిచెల్, విలియమ్సన్ ఉన్నారు.