WTC | దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. స్వదేశంలో ఇంగ్లండ్తో క్రిస్ట్చర్చ్లో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు మూడు పాయింట్ల కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
పాయింట్ల కోతనే గాక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ 15 శాతం జరిమానా పడింది. కివీస్తో పాటు ఇంగ్లండ్కూ ఇది వర్తించనుంది. దీంతో న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 47.92 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఆ జట్టు ఫైనల్ రేసులో నిలవాలంటే తర్వాత ఆడబోయే రెండు టెస్టులలోనూ గెలిచి ఇతర జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తేనే అవకాశముంటుంది.