క్రైస్ట్చర్చ్: పాకిస్థాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో న్యూజిలాండ్ అదరగొడుతున్నది. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న కివీస్ శుక్రవారం నాలుగో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. రిజ్వాన్ (90 నాటౌట్) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, హెన్రీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 18.1 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్లకు 159 రన్స్ చేసింది. డారిల్ మిచెల్ (72 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (70 నాటౌట్) అర్ధశతకాలతో సత్తాచాటారు. పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు.