రావల్పిండి: మరికొద్ది గంటల్లో ప్రారంభం కావాల్సి ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ చివరి నిమిషంలో రద్దయింది. రావల్పిండిలో శుక్రవారం సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య తొలి వన్డే జరగాల్సి ఉంది. అయితే న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ అలెర్ట్ రావడంతో సిరీస్ను రద్దు చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూజిలాండ్ ప్రభుత్వ సెక్యూరిటీ అలెర్ట్ తర్వాత బ్లాక్క్యాప్స్ తమ పాకిస్థాన్ టూర్ను రద్దు చేసుకుంటోంది. రావల్పిండిలో శుక్రవారం తొలి వన్డే ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం లాహోర్ వెళ్లాల్సి ఉన్నా.. టూర్ రద్దు చేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ ఆ ప్రకటనలో తెలిపింది.