వెల్లింగ్టన్: శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. లంకతో సోమవారం ముగిసిన రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్లో భాగంగా ఓవర్నైట్ స్కోరు 113/2 నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన లంక 358 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ కుశాల్ మెండిస్(50) పరుగులేమి జత చేయకుండానే నిష్క్రమించగా, ధనంజయ డిసిల్వా(98), దినేశ్ చండిమాల్(62) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. కివీస్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొంటూ వీరిద్దరు కలిసి ఐదో వికెట్కు 126 పరుగులు జతచేశారు. చండిమాల్ ఔటైనా..డిసిల్వా సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సౌథీ, టిక్నర్ మూడేసి వికెట్లు తీశారు. నికోల్స్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, విలియమ్సన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.