వెల్లింగ్టన్: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ఇక యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్తో భారత్ తొలి టీ20 ఆడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. పవర్ప్లేలో రక్షణాత్మక ధోరణిలో ఆడటం వల్లే.. పొట్టి ప్రపంచకప్లో భారత్ పరాజయం పాలైందనే విమర్శలు వెల్లువెత్తిన వేళ.. ఈ అంశంపై మేనేజ్మెంట్ దృష్టి సారించనుంది.
ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతుండటంతో జట్టులో పెనుమార్పులు చేయాల్సిన అవసరముందని మాజీలు అంటున్న నేపథ్యంలో.. యువ ఆటగాళ్ల సత్తాకు ఈ సిరీస్ పరీక్ష కానుంది. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్తో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తున్నా.. అందివచ్చిన అవకాశాన్ని వీళ్లు ఏ మేరకు ఉపయోగించుకుంటారనేది కీలకం కానుంది.