ఒక్కరోజులో 46,951 కేసులు
మహారాష్ట్రలోనే 30వేలకుపైగా
న్యూఢిల్లీ, మార్చి 22: దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో 46,951 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధికం. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్లోనే 80.5 శాతం కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 30,535 కేసులు (65.03 శాతం) రికార్డయ్యాయి.
తీరత్సింగ్ రావత్కు పాజిటివ్
ఉత్తరాఖండ్ సీఎం తీరత్సింగ్ రావత్కు కరోనా సోకింది. తాను క్షేమంగా ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మాస్క్ ధరించని అభ్యర్థులను నిషేధించాలి
మాస్క్ ధరించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించే అభ్యర్థులు, వారి మద్దతుదారులను రానున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా నిషేధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రానికి, ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు జారీచేసింది.
కరోనా కట్టడిలో ఆస్ట్రాజెనెకా భేష్
కరోనా కట్టడికి ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్పై అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో చేసిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో టీకా సమర్థత 79 శాతంగా తేలింది.
కొవిషీల్డ్ రెండోడోసు 8 వారాల్లోపు
కరోనా కట్టడికోసం దేశంలోని ప్రాధాన్యత వర్గాలకు వేస్తున్న కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రారంభంలో ఈ టీకా మొదటి డోసు వేసిన తర్వాత 4-6 వారాల్లోపు రెండో టీకా వేయాలని సూచించగా, తాజాగా దాన్ని సవరించింది. మొదటి డోసు వేసిన 4-8 వారాల వ్యవధిలో కొవిషీల్డ్ రెండో డోసు వేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్భూషణ్ సూచించారు. ఈ సూచన కొవిషీల్ట్ టీకాకు మాత్రమేనని మరో టీకా కొవాగ్జిన్కు కాదని స్పష్టంచేశారు.