కాన్పూర్: న్యూజిలాండ్తో సిరీస్కు ముందు భారత ఆటగాళ్లకు కేవలం ‘హలాల్’ మాంసం మాత్రమే అందించాలని నిర్ణయించిన బీసీసీఐ నిర్ణయం వివాదాస్పదమవుతున్నది. కాన్పూర్ వేదికగా గురువారం నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. రహానే సేన మెనూలో ‘హలాల్’ మాంసం మాత్రమే ఉండాలని బోర్డు.. నిర్వాహకులకు సూచించింది. దీంతో పాటు బీఫ్, పోర్క్ను భోజన పట్టిక నుంచి తొలగించాలని పేర్కొంది. కాగా.. దీనిపై బీజేపీ నాయకులు గౌరవ్ గోయల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆటగాళ్లు వాళ్లకిష్టమొచ్చింది తింటారు. అంతేకాని ‘హలాల్’ మాత్రమే తినాలని నిర్ణయించడానికి బీసీసీఐకి ఏ హక్కు ఉంది. ఇది అనైతికం.. దీన్ని అనుమతించకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.