బుదాపెస్ట్: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో.. జావెలిన్ను 88.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని నీరజ్ చోప్రా(Neeraj Chopra) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే ట్రాక్పై ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇటీవల ప్రతి ఈవెంట్లోనూ ఇద్దరి మధ్య గట్టి పోటీ సాగుతోంది. బుదాపెస్ట్లో ఫైనల్ ముగిసిన తర్వాత .. సంబరాలు జరుపుకునే సమయంలో నీరజ్ చోప్రా అందర్నీ మనసుల్ని గెలిచాడు. ట్రాక్ఫై ఫోటో దిగుతున్న సమయంలో.. పాక్ ప్లేయర్ నదీమ్ను నీరజ్ ఆహ్వానించాడు. త్రివర్ణ పతకాన్ని పట్టుకుని ఫోటో కోసం ఫోజు ఇచ్చిన నీరజ్ వద్దకు పాక్ అథ్లెట్ అర్షద్ వచ్చి ఫోటో దిగాడు. ఆ సమయంలో కాంస్య పతకం గెలిచిన చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకుబ్ వద్లేజ్ కూడా ఉన్నాడు. నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్లు కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజెన్లు తమ కామెంట్లతో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
Neeraj Chopra called Arshad Nadeem for this beautiful click. Spread love not hate Between neighbours 🇵🇰❤️🇮🇳 pic.twitter.com/SyWeddOvne
— ZaiNii💚 (@ZainAli_16) August 27, 2023