కామన్వెల్త్ గేమ్స్ కంటే నాలుగు రోజులు ముందే అమెరికాలో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం సాధించిన తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ క్రీడల నుంచి తప్పుకున్నాడు. భారత్కు పక్కా పతకం వచ్చే క్రీడలలో జావెలిన్ త్రో కూడా ఒకటి. అయితే ఈసారి నీరజ్ చోప్రా గాయపడటంతో ఈ క్రీడలో పసిడి పట్టే అవకాశం పాకిస్తాన్కు దక్కింది. ఆ దేశానికి చెందిన అర్షద్ నదీమ్.. రికార్డు త్రో విసిరి బంగారు పతకం నెగ్గాడు.
ఆదివారం ముగిసిన జావెలిన్ త్రో ఈవెంట్లో అర్షద్.. ఏకంగా 90.18 మీటర్ల దూరం బల్లెం విసిరి కామన్వెల్త్ గేమ్స్లో తొలి స్వర్ణం నెగ్గాడు. స్వర్ణం నెగ్గడంతో పాటు ఇంత దూరం బరిసెను విసరడంతో అతడు సరికొత్త రికార్డులు సృష్టించాడు. తాజాగా అర్షద్ విసిరిన త్రో తో అతడు.. దక్షిణాసియాలో 90 మీటర్ల దూరాన్ని విసిరిన తొలి జావెలిన్ త్రోయర్గా అవతరించాడు.
తాజా ప్రదర్శనతో అర్షద్.. విశ్వ వేదికలపై నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శనల రికార్డులను కూడా బద్దలుకొట్టాడు. గతేడాది టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గినప్పుడు నీరజ్.. 87.58 మీటర్ల దూరం విసరగా, తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో 88.13 మీటర్లు విసిరాడు.
ఇక కామన్వెల్త్ క్రీడలలో అర్షద్ నదీమ్ స్వర్ణం పాకిస్తాన్కు రెండోవది. అంతకుముందు వెయిట్ లిఫ్టర్ నూహ్ దస్తగిర్ ఆ దేశానికి తొలి స్వర్ణాన్ని అందించాడు. మొత్తంగా ఆ దేశం.. 2 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు సాధించింది. 8 పతకాలు సాధించిన పాక్.. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్.. 18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు గెలిచి మొత్తంగా 55 పతకాలతో ఐదో స్థానంలో ఉంది.
#ArshadNadeem becomes the first man in South Asia to break the 90 meters barrier with a monster throw of 90.18m . Considering you were nursing a injury, we’re absolutely blown away by your performance sir! 🇵🇰👏👏pic.twitter.com/jEEHJsSrhA https://t.co/mQ94z8iOzs
— PML(N) (@pmln_org) August 7, 2022